అమరావతి : విభజన చట్టంలో పేర్కొన్నవిధంగా నియోజకవర్గాల పునర్విభజన హామీని వెంటనే నెరవేర్చాలని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన 2031 వరకు సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ పార్లమెంట్లో చెప్పడం శోచనీయమని పేర్కొన్నారు.
విభజన చట్టం హామీల్లో పునర్విభజన ఉందనే విషయాన్ని కేంద్రం గుర్తించాలని ఆయన సూచించారు. కశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజనకు అవసరం లేని చట్టసవరణ తెలుగు రాష్ట్రాలకే అవసరమైందా అని ప్రశ్నించారు. ఒక్కో రాష్ట్రం విషయంలో ఒక్కోలా నిర్ణయం తీసుకోవడం కేంద్ర ప్రభుత్వానికి సరికాదన్నారు.