అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక లావాదేవిలను నడుపుతున్నందున వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రాష్ట్రంలో 360ని అమలు చేయాలని టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు అన్నారు. ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం గత సంవత్సరపు బడ్జెట్లో రూ.48 వేల కోట్ల పైగా లెక్కలు చెప్పడం లేదని స్వయంగా కాగ్ పేర్కొందని ఆరోపించారు. ఈ డబ్బు ఏమైందో చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఆయన అన్నారు.
ఇంత పెద్దమొత్తం ప్రజల డబ్బు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లిందని విమర్శించారు. ప్రత్యేక బిల్లు పేరుతో ఆర్థిక నిబంధనలకు వ్యతిరేకంగా జీవోలు విడుదల చేసిన ఏపీ ఎక్కడ ఖర్చుపెట్టిందో చెప్పడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి ఏపీలో జరుగుతున్న ఆర్థిక అక్రమ వినియోగంపై జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.