అమరావతి : విశాఖ జిల్లాలో డ్రగ్స్ను సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. గిరీశ్, తేజనాయుడు అనే ఇద్దరు ఆన్లైన్లో డ్రగ్స్ను విక్రయిస్తుండగా వారిని పట్టుకున్నామని నగర పోలీసు కమిషనర్ తెలిపారు. వీరి వద్ద నుంచి డ్రగ్స్కు సంబంధించిన ఎల్ఎస్డీ 63 బ్లాట్స్ను స్వాధీనం చేసుకున్నామని వివరించారు.
నిందితులు బెంగళూరు, గోవా, హైదరాబాద్ నుంచి డ్రగ్స్ తెస్తున్నారని వెల్లడించారు. తేజనాయుడు మొదట డ్రగ్స్ సేవించేవాడని , డబ్బులు సంపాధన కోసం వ్యాపారం మొదలు పెట్టాడని ఆయన వివరించారు. రూ. 650లకు డ్రగ్స్ను కొనుగోలు చేసి రూ.2000కు విక్రయిస్తున్నాడని సీపీ పేర్కొన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసిన రిమాండ్కు పంపినట్లు ఆయన తెలిపారు.