తిరుపతి : తిరుపతిలో కార్తీక దీపోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని కార్యాలయంలో శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ కార్తీక దీపోత్సవాల్లో ఏవైనా చిన్నపాటి లోటుపాట్లు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్తీక దీపోత్సవాలు నిర్వహించే మైదానాలను ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించి అవసరమైన పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు.
దీపోత్సవాల నిర్వహణకు వెళ్లే అధికారులు, సిబ్బందికి తగిన వసతి, ఆహారం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. నంద్యాల జిల్లా యాగంటిలో నవంబరు 7న, విశాఖపట్నంలో నవంబరు 14న శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఈవో పేర్కొన్నారు. ఈ సమావేశంలో జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ్ కుమార్, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్ఇలు జగదీశ్వర్రెడ్డి, వెంకటేశ్వర్లు, ఎస్వీ వేద వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధేశ్యామ్, డీపీపీ ప్రత్యేకాధికారి విజయలక్ష్మి, ఎస్వీ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ పాల్గొన్నారు.