అమరావతి: ఏపీలోని గుంటూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ ఒకరు మృతి చెందారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఎదుట రెండు ద్విచక్రవాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎస్కె. సమద్ బాషా అక్కడికక్కడే మృతి చెందగా మరో హెడ్ కానిస్టేబుల్ పిట్టు శ్రీనివాస రెడ్డికి గాయాలయ్యాయి. శ్రీనివాసరెడ్డిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
సమద్ బాషా మృతి పట్ల పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు , పోలీసు అధికారులు తీవ్ర సంతాపం తెలిపారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.