అమరావతి: ఏపీముఖ్యమంత్రి వైఎస్ జగన్ తలపెట్టిన అభివృద్ధికార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి నెట్ సౌకర్యం ప్రాధాన్యతను గుర్తించి అన్ని గ్రామ పంచాయతీలకు, రైతు భరోసా కేంద్రాలకు అత్యాధునిక సాంకేతికతతో ఇంటర్నెట్ అందించేందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) కృషి చేస్తుందని ఆ సంస్థ ఛైర్మన్ పి.గౌతంరెడ్డి అన్నారు. ఇంటర్నెట్ వైర్ ద్వారానే వెళ్లే ఆనవాయితీ భారత దేశమంతా ఉందని కానీ,ఆంధ్రప్రదేశ్ లో 5 కిలో మీటర్ల దూరంలో ఒక టవర్ను ఏర్పాటు చేసి ఆ టవర్ నుంచి మరో టవర్ కి కనెక్ట్ చేసి వైర్ లెస్ ఇంటర్నెట్ అందించే విధంగా ప్రాజెక్టును తీసుకురావడం జరిగిందని,చిత్తూరులో ట్రయల్ రన్ గా ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.
బాక్స్ సిస్టం ద్వారా నెట్ ను అందించేందుకు కంపెనీలు మందుకొచ్చాయన్నారు. ఇంటర్ నెట్ ను ఇంటింటికీ అందించేందుకు ఫైలట్ ప్రాజెక్టుగా త్వరలో విజయవాడలో మంత్రి ప్రారంభిస్తారని తెలిపారు.