అమరావతి : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద (YS Viveka) హత్యకేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి (Dastagiri) మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే, ఎంపీ టికెట్ కోసం వివేకాను హత్య (Murder) చేశారని ఆయన ఆరోపించారు. ఈ కేసులో తాను జైలులో(Jail) ఉండగా దేవిరెడ్డి చైతన్య రెడ్డి తనను ప్రలోభాలకు గురి చేయడం వాస్తవమని స్పష్టం చేశారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
జైలులో జరిగిన విషయాలన్నంటినీ, తనను ప్రలోభపెట్టిన విషయాలను కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. జైలు అధికారుల తీరుపై ఎస్పీ, సీబీఐ ఎస్పీకి లేఖ రాశానని పేర్కొన్నారు. జైలులో సీసీ కెమెరాలు పనిచేసేలా చూసే బాధ్యత అధికారులదేనని, సీసీ ఫుటేజీల(CC Footage)ను పరిశీలిస్తే ఇది అవగతమవుతుందని అన్నారు. వివేకాను హత్య చేయించిన వాళ్లే తనపై బురద జల్లుతున్నారు ఆరోపించారు.
వివేకా హత్య వెనుక అవినాష్రెడ్డి (Avinash reddy) , భాస్కర్రెడ్డి, శివశంకర్రెడ్డి ఉన్నారని, వారి సూచనలతోనే హత్య జరిగిందని తెలిపారు. జైలు అధికారులు ఇబ్బంది పెట్టి నాతో లేఖ రాయించు కున్నారని, సీబీఐ తలుచుకుంటే అన్నీ బయటకు వస్తాయని దస్తగిరి తెలిపారు. జై భీమ్ భారత్ తరఫున పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని వివరించారు. వివేకాను చంపిన నాకు ఓటు అడిగే హక్కు లేదంటున్నారని, హత్య చేయించిన వ్యక్తి జగన్కు ఓటు అడిగే హక్కు ఉందా అని ప్రశ్నించారు.