అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఆయా జిల్లాలకు జిల్లా పోలీస్ బాస్లను నియమించింది. నలుగైదు చోట్ల మాత్రం పాతవారినే కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చిం ది. ఇదివరకు 13 జిల్లాలున్న ఏపీ నోటిఫికేషన్తో 26 జిల్లాలు కానున్నాయి. రేపటి నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కానున్నది. శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా జి.ఆర్ రాధిక , విజయనగరం జిల్లా ఎస్పీగా ఎం.దీపిక , పార్వతి పురం ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు, విశాఖ కమిషనర్గా సిహెచ్. శ్రీకాంత్ను నియమించింది. అనకాపల్లి ఎస్పీగా గౌతమి సాలి , అల్లూరి జిల్లా ఎస్పీగా సతీశ్కుమార్, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి, కాకినాడ ఎస్పీగా రవీంద్రనాథ్ బాబు, కోనసీమ జిల్లాఎస్పీగా కె.ఎస్.ఎస్. వి సుబ్బారెడ్డి , పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా రవిప్రకాశ్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది .
ఏలూరు జిల్లా ఎస్పీగా ఆర్.ఎన్ అమ్మిరెడ్డి , కృష్ణ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ కౌశల్, విజయవాడ కమిషనర్గా క్రాంతిరాణా టాటా, గుంటూరు అర్బన్ ఎస్పీగా కె.ఆరీఫ్ హాఫీజ్ కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. పల్నాడ్ జిల్లా ఎస్పీగా రవిశంకర్రెడ్డి, బాపట్ల జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్, ప్రకాశం జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్, నెల్లూరు జిల్లా ఎస్పీగా సీహెచ్ విజయారావులను కొనసాగింపు అవకాశం కల్పించింది.
చిత్తూరు జిల్లా ఎస్పీగా రిశాంత్రెడ్డి, తిరుపతి ఎస్పీగా పరమేశ్వర్రెడ్డిని నియమిస్తూ కడప జిల్లా ఎస్పీగా అన్బురాజన్, అనంతపురం జిల్లా ఎస్పీగా ఫకీరప్పను కొనసాగింపు ఇచ్చారు. అన్నమయ్య ఎస్పీగా హర్షవర్ధన్రాజు , సత్యసాయి జిల్లా ఎస్పీగా రాజుల్ దేవ్సింగ్ , కర్నూల్ జిల్లా ఎస్పీగా సుధీర్కుమార్ రెడ్డి, నంద్యాల జిల్లా ఎస్పీగా కె. రఘువీరారెడ్డిని ప్రభుత్వం నియమించింది .