హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ, ఇ హుండీ, ఇ డోనేషన్స్, పరోక్ష సేవ వంటి కొత్త కార్యక్రమాలను ప్రారంభించింది. మరిన్ని సేవలను అందించే ప్రణాళికల్లో భాగంగా సీనియర్ మీడియా ప్రతినిధి సీవీ సుబ్బారావును రాష్ట్ర దేవాదాయ శాఖ సలహాదారుడు (ఎన్నారై వింగ్)గా నియమించింది.
విదేశాల్లో దేవాలయాల ఏర్పాటు, విదేశీ భక్తుల నుంచి ఆగమ, ఇతర విషయాలపై రాష్ట్ర దేవాదాయశాఖకు ఎన్నో అభ్యర్థనలు వస్తున్నాయని ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. పలువురు ఎన్నారైలు తమ గ్రామాల్లో దేవాలయాల అభివృద్ధికి ముందుకు వస్తున్న నేపథ్యంలో వీటిపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడంలో సుబ్బారావు సహకరిస్తారని పేర్కొన్నారు. సుబ్బారావు ఈనాడు, ఉదయం, ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికల్లో పనిచేశారు. గత 18 సంవత్సరాలుగా ప్రచురితమౌతున్న తెలుగుటైమ్స్ పత్రికకు ఎడిటర్, ఎండీగా పనిచేస్తున్నారు.