తిరుపతి: కల్యాణ మండపాలను లీజుకు ఇవ్వనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రకటించింది. అందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మల్లం, విద్యానగర్ ప్రాంతాల్లోని టీటీడీ కల్యాణ మండపాలను ఐదేండ్ల పాటు లైసెన్స్ ప్రాతిపదికన నిర్వహించేందుకు ప్రతిపాదనలు ఆహ్వానిస్తోంది.
ఆసక్తి కలిగిన హిందూ ఆలయాలు, మఠాలు, ట్రస్టులు, సంస్థలు, వ్యక్తులు అందుకోసం దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. మరిన్నివివరాలకు www.tirumala.org లేదా www.tender.apeprocurement.gov.inవెబ్సైట్ల ను గానీ, 0877- 2264174, 2264175 ఫోన్ నంబర్లను గానీ సంప్రదించవచ్చు.