YS Sharmila | రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. ఈ పొత్తులపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా.. రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచిన బీజేపీతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎలా పెత్తు పెట్టుకున్నారంటూ ఆమె ప్రశ్నించారు. ఆదివారం ఎక్స్ వేదికగా షర్మిల స్పందించారు. ఈ మేరకు ప్రజలకు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. జగన్ బీజేపీతో రహస్య పొత్తుతో నడుస్తున్నారని ఆరోపించారు. అయితే, బీజేపీకి బానిసగా బతకాల్సిన ఖర్మ ఎందుకు? అంటూ ప్రశ్నించారు. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు అని చెప్పిన బీజేపీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
2.30 లక్షల ఉద్యోగాల భర్తీ అనే హామీతో జగన్ అన్న అధికారంలోకి వచ్చారని.. మెగా డీఎస్సీ అని చెప్పి దగా డీఎస్సీ విడుదల చేశారన్నారు. బీజేపీకి, వైసీపీకి అసలు తేడా ఏముంది? అంటూ ప్రశ్నించారు. ఏపీలో బీజేపీకి బీ పార్టీగా వైసీపీ ఉందని.. బీజేపీకి వారసులని జగన్ నిరూపించుకున్నారన్నారు. ‘సిద్దం’ సభలతో కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేస్తున్నారన్నారు. జనాలను పోగేసుకుని మళ్లీ మాయ చేస్తున్నారని.. బీజేపీతో అంటకాగే పార్టీ లకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. యువకుల కోసం కాంగ్రెస్ నేషనల్ మేనిఫెస్టో విడుదల చేసింది. ‘భర్తీ భరోసా’ పేరుతో యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని.. రాహుల్ గాంధీ యువత, నిరుద్యోగ సమస్యలపై స్పందించి ఈ మేనిఫెస్టోను రూపొందించారంటూ షర్మిల ట్వీట్ చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ,రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచిన బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు సమాధానం చెప్పాలి. జగనన్న అయితే బీజేపీతో రహస్య పొత్తుతో నడుస్తున్నారు.బీజేపీకి బానిసగా బతకాల్సిన ఖర్మ ఎందుకు? ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పిన… pic.twitter.com/bgU5J8BLQ3
— YS Sharmila (@realyssharmila) March 10, 2024