హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): ఏపీలో ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్కు కొత్త సిరీస్ నంబర్ రానున్నది. ఈ మేరకు రవాణాశాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. నూతనంగా ప్రభుత్వం కొనుగోలు చేసే వాహనాలకు ఇకపై ఈ సిరీస్తో నంబర్లను కేటాయించనున్నారు. 2018 చివరి నుంచి ప్రైవేటు వాహనాలకు రవాణాశాఖ 39 సిరీస్ను జారీ చేస్తున్నది.
ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలను వేరు చేసేలా ఇకపై ఈ కొత్త సిరీస్ను తీసుకొచ్చారు. దీనిపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలను కోరుతున్నట్టు నోటిఫికేషన్లో రవాణాశాఖ పేర్కొన్నది.