AB Venkateswara Rao | తాను రిటైర్ అయినా జీవితాంతం ప్రజాసేవలోనే ఉంటానని ఆంధ్రప్రదేశ్లో శుక్రవారం పదవీ విరమణ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు చెప్పారు. రిటైర్మెంట్ తర్వాత దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు అవకాశం లభిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. ‘ఈ రోజు వృత్తి రీత్యా మాత్రమే రిటైరవుతున్నా.. తుది శ్వాస వరకూ అన్యాయాన్ని ఎదురిస్తూ.. బాధితుల తరఫున పోరాడుతూనే ఉంటా’ అని చెప్పారు. ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్పై సుదీర్ఘ పోరాటంతో విజయం సాధించిన ఏబీ వెంకటేశ్వర రావు.. శుక్రవారం ఉదయం విజయవాడ ముత్యాలంపాడులోని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ శాఖ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ఈ రోజే చివరి రోజు కావడంతో సాయంత్రం పదవీ విరమణ చేశారు.