అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,926 మందికి వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వైరస్తో ఆరుగురు మృత్యువాతపడ్డారు. కొత్తగా 3,913 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. 43,763 కొవిడ్ పరీక్షలు చేయగా.. 12,926 కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. తాజా నమోదైన కేసులతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 21,66,194కు పెరిగాయి.
ఇందులో 20,78,513 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 73,143 యాక్టివ్ కేసులున్నాయని, వైరస్ ఇప్పటి వరకు 14,538 మంది మృతి చెందారని ఆరోగ్యశాఖ పేర్కొంది. కొత్త కేసుల్లో అత్యధికంగా విశాఖపట్నంలో అత్యధికంగా 1,959 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. ఆ తర్వాత చిత్తూరులో 1566, అనంతపూర్లో 1379, గుంటూరులో 1212, ప్రకాశంలో 1001 మందికి వైరస్ సోకింది.