అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల్లో 11,573 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడి మరో ముగ్గురు మృతి చెందగా.. కొత్తగా 9,445 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.15లక్షలకుపైగా యాక్టివ్ కేసులున్నాయి. ఒకే రోజు 40,357 కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. ఇదిలా ఉండగా.. శుక్రవారం ఒక్కరోజే 12,516 కరోనా కేసులు, 12 మరణాలు నమోదయ్యాయి. గురువారం 13,474 కేసులు రికార్డవగా.. వరుసగా మూడో రోజు శనివారం కేసులు తగ్గుముఖం పడుతుండడంతో ఊరటనిస్తున్నది. కొత్తగా నమోదైన కేసుల్లో కడప జిల్లాలో అత్యధికంగా 1,942, కర్నూలు జిల్లాలో 1522, గుంటూరు జిల్లాలో 1298 అత్యధికంగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.