అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహమ్మారి కొవిడ్ కేసులు క్రమంగా తగ్గిపోతున్నాయి. రాష్ట్రంలో శుక్రవారం 1166 కేసులు రాగా.. గత 24 గంటల్లో 800 కేసులు మాత్రమే నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటలకలె కొత్తగా 896 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2312029 కు చేరాయి. గత 24 గంటల్లో 24, 066 శాంపిళ్లను పరీక్షించగా.. 896 మందికి పాజిటివ్గా తేలింది. ఇదే సమయంలో కొవిడ్ కారణంగా ఆరుగురు చనిపోయారు.
గడిచిన 24 గంటల్లో 8,849 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 22,72,881 కు చేరింది. కాగా, కొవిడ్ వల్ల అనంతపురంలో ఇద్దరు, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో మరణించిన వారి సంఖ్య 14,694 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 24,454 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.