అమరావతి : ప్రభుత్వ ప్రాపకం కోసం ఏపీ పోలీసులు మరీ సాగిలపడడాన్ని ప్రజలెవ్వరూ ఆమోదించరని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఏపీ పోలీస్ అనే బ్రాండ్ సర్వనాశనం కావడానికి ప్రజలకు పోలీసు లపై నమ్మకం పోవడానికి ప్రస్తుతం ఏపీలో జరుగుతునే కొన్ని ఘటనలుచాలని ట్విట్టర్ లో ఆరోపించారు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకునేది నిందితులను రక్షించేందుకు కాదని గుర్తించుకోవాలని అన్నారు.
పోలీసులు చట్టం ప్రకారం పనిచేయాలని సూచించారు. కుప్పంలో నిరసనలు చేపడితే హత్యాయత్నం కేసుపెట్టారని మండిపడ్డారు. విజయవాడలో దాడి చేసి కన్ను పోగొడితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారని ఆరోపించారు. ఈ రెండు ఘటనల్లో వ్యవహరించిన తీరు పోలీసు శాఖ ప్రతిష్టకే మాయని మచ్చగా మిగులుతుందని అన్నారు. ప్రజలకు పోలీసులపై నమ్మకం పోవడానికి ఈ ఘటన చాలని పేర్కొన్నారు. పోలీసులు తమ శాఖ పనితీరు, తాము ఎటువైపో స్పష్టంగా చెప్పారని విమర్శించారు.