హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్కు బుధవారం ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న వారాహి యాత్రపై రాళ్ల దాడికి ప్లాన్ చేశారని తనకు సమాచారం అందిందంటూ పవన్ కల్యాణ్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో నోటీసులు ఇచ్చామని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా వెల్లడించారు.
పవన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పారు. అసత్యపూరిత ప్రచారం చేయడం సరికాదని సూచించారు. మచిలీపట్నంలో జనసేన భరోసా కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. తన యాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం చూస్తున్నదని ఆరోపించారు. సభలో ఎలాంటి అలజడులు సృష్టించినా ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు.