అనంతపురం: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బెళుగప్ప మండలం కాల్వపల్లి వద్ద ఇద్దరు మహిళలపై నుంచి లారీ దూసుకెళ్లింది. దీంతో వారు అక్కడికక్కడే మరణించారు. అయితే ప్రమాదం అనంతరం లారీ ఆపకుండా వెళ్లిపోయింది. దీంతో స్థానికులు దానిని వెంబడిం బోరంపల్లి-గోళ్ల గ్రామాల మధ్య పట్టుకుని డ్రైవర్కు దేహశుద్ధిచేశారు.
కాగా, సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను లక్ష్మీదేవి, సరస్వతిగా గుర్తించారు. ఇద్దరు పేరూరు జలాశయాన్ని చూడడానికి వచ్చారని, ప్రాజెక్టును చూస్తుండగా లారీ వారిపైనుంచి వెళ్లిపోయిందని, దీంతో వారి అవయవాలు ఛిద్రమైపోయాయని చెప్పారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.