అమరావతి : వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పార్లమెంట్ ఆవరణలో సొమ్మసిల్లి పడిపోవడంతో అక్కడి సిబ్బంది ఆయనను ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వైద్యులు అత్యవసర వార్డులో చికిత్స అందజేస్తున్నారు.
ఇవాళ మధ్యాహ్నం పూట పార్లమెంట్ ఆవరణలో సొమ్మసిల్లి కిందపడిపోయారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మరి కాసేపట్లోనే పిల్లి సుభాష్ చంద్రబోస్ హెల్త్ బులిటెన్ ను ఆస్పత్రి వైద్యులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.