అమరావతి : మరో రెండు సంవత్సరాల్లో రాబోయే ఎన్నికలకు సన్నద్దం అయ్యేందుకు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. దీంట్లో భాగంగా సచివాలయంలో ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ఇవాళ తొలి మంత్రివర్గంలో ఉన్న వారందరీ చేత రాజీనామా చేయించారు. మొత్తం 24 మంది మంత్రులు తమ రాజీనామా పత్రాలను ఏపీ సీఎం జగన్కు అందజేశారు. దాదాపు రెండు గంటల పాటు కొనసాగిన క్యాబినెట్ సమావేశంలో ఏపీ మంత్రులంతా పాల్గొన్నారు.
మంత్రులంతా రెండున్నరేళ్ల వరకే కొనసాగుతారని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించినందున ఆ గడువు గత డిసెంబర్లో ముగిసింది. దీంతో మంత్రివర్గంలో మార్పుచేర్పులు చోటు చేసుకుంటున్నాయి. మంత్రులు ఆళ్లనాని, ధర్మాన కృష్ణదాస్, పాముల పుష్ప శ్రీవాణి, కే నారాయణ స్వామి, అంజద్ బాషా, సుచరిత, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, శంకర్ నారాయణ, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేశ్, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, తానేటి వనిత, రంగనాథ రాజు, అవంతి శ్రీనివాస్రావు, కన్నబాబు, పిన్నపి విశ్వరూప్, గమ్మనూర్ జయరాం, గోపాల కృష్ణ, సిదిరి అప్పలరాజు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. తమ రాజీనామా లేఖలను సీఎం జగన్కు అందజేశారు.