అమరావతి : జనసేన అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan )పై ఏపీ మంత్రులు మరోసారి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. వేషాలు వేసి మోసాలు చేసి హిందూ ధర్మాన్ని కూడా పాటించలేని వ్యక్తని మంత్రులు కొట్టు సత్యనారాయణ, వేణుగోపాల కృష్ణ దుయ్యబట్టారు. వివాహ వ్యవస్థపై పవన్కు నమ్మకం లేదని ఆరోపించారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్నే పవన్ కల్యాణ్ డైలాగులు కొడుతున్నారని విమర్శించారు.
ముఖ్యంగా చంద్రబాబు లాంటి శనిని నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నాడని ఆరోపించారు. చంద్రబాబును వదులుకుంటేనే రాజకీయ భవిష్యత్ ఉంటుందని సూచించారు. చంద్రబాబు హయాంలో కూల్చిన దేవాలయాల గురించి ఆనాడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. వాలంటీర్ల వ్యస్థను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రజలే పవన్కు సరైనా సమయంలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.