అమరావతి : మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును సమర్ధిస్తున్న ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణపై ఏపీ మంత్రి జోగి రమేశ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘దమ్ము, ధైర్యం, పౌరుషం ఉంటే మీ బావ చంద్రబాబును నిలదీయా’లని డిమాండ్ చేశారు. సిగ్గు, శరం లేకుండా నందమూరి కుటుంబం కేరాఫ్ అడ్రస్ నారా కుటుంబంగా మారిందని ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వం మహనీయుడు ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచేలా ఒక జిల్లాకు పేరు పెడితే స్పందించకుండా కేవలం ఒక యూనివర్సిటీకి పేరుమారిస్తే శునకాలంటూ విమర్శలు చేయడంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ పేరు పెట్టిన జగన్నే అడిగే నైతిక హక్కు ఎక్కడిదని అన్నారు. ఆరోగ్య వర్సిటీ అనేది చాలా చిన్న అంశమని జిల్లాకు ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా ఉండే అంశమని పేర్కొన్నారు.
పునర్జన్మ ఇచ్చిన వైఎస్సార్కు బాలయ్య రుణపడి ఉండాలని మంత్రి సూచించారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరుమార్పుపై బాలకృష్ణ తీవ్రంగా స్పందించారు. మహానీ యుడు ఎన్టీఆర్ పెట్టిన భిక్షతో వైసీపీపార్టీలో బతుకుతున్న నేతలున్నారని, శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులని ఆయన విమర్శించారు. ఈ విమర్శలపై జోగి రమేశ్ మీడియా సమావేశంలో మాట్లాడారు.