అమరావతి : ప్రముఖ సినీనటుడు రజనీకాంత్(Rajinikanth) పై ఆంధ్రప్రదేశ్కు చెందిన మంత్రులు(AP Ministers) ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి(NTR centenary) వేడుకల్లో రజనీకాంత్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు(Chandra Babu) హయాంలో హైదరాబాద్ను న్యూయార్క్లా, ఏపీని అభివృద్ధి చేశారని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్(Vellampalli Srinivas), రోజా(ROJA), మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) మండిపడ్డారు.
రజనీకాంత్ సినిమాల్లో సూపర్స్టార్ అని, రాజకీయాలో కాదని మంత్రి వెల్లంపల్లి ఆరోపించారు. ఏపీ రాజకీయాల్లో అవగాహన లేని వ్యక్తి రజనీకాంత్ అని విమర్శించారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచినప్పుడు చంద్రబాబుతో రజనీకాంత్ కూడా చేతులు కలిపాడన్న విషయం అందరికీ తెలుసని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) నిర్మించినట్లు చంద్రబాబు ఏపీలో శాశ్వత సచివాలయం(Secretariat) ఎందుకు కట్టలేకపోయాడని నిలదీశారు.
మంత్రి రోజా మాట్లాడుతూ చంద్రబాబు భజన చేసేందుకు రజనీకాంత్ విజయవాడకు వచ్చారా ? అంటూ ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబును రజనీకాంత్ పొగడటం విడ్డూరంగా ఉందని అన్నారు. రజనీ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ కూడా బాధపడుతుందని అన్నారు. చంద్రబాబు లేనప్పుడే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని వెల్లడించారు.
మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ రజనీకాంత్ సిగ్గులేకుండా చంద్రబాబును పొగుడుతున్నారని దుయ్యబట్టారు. పవన్ను బ్లాక్మెయిల్ చేసేందుకే రంగంలోకి రజనీకాంత్ను దించారని పేర్కొన్నారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలను పవన్ గ్రహించాలని సూచించారు. ఎన్టీఆర్ బతికున్నప్పుడు రజనీకాంత్ ఏం చేశారని కొడాలి నాని ప్రశ్నించారు.