అమరావతి : గుంటూరులో వైసీపీ ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏపీ పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదరి అప్పాలరాజు సభా వేదికపై ఆడిపాడి గంతులేశారు. సభా కార్యక్రమానికి ముందు సాంస్కృతిక కళాకారులతో కలిసి ఆయన పాటలు పాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేండ్లకు ఈ ప్లీనరీని నిర్వహిస్తున్నారు. పార్టీ నిబంధనల ప్రకారం ప్రతి ఐదేండ్లకొకసారి ప్లీనరీని నిర్వహిస్తున్నామని పార్టీకి చెందిన నాయకులు వెల్లడించారు.
దీంట్లో భాగం గుంటూరులో రెండురోజుల పాటు ఈ ప్లీనరీని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తొలిసారిగా ప్లీనరీని నిర్వహిస్తుండడంతో రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీశ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.