అమరావతి : తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ హెల్త్ బులెటిన్ను హైదరాబాద్ వైద్యులు విడుదల చేశారు. హైదరాబాద్ సిటీ న్యూరో సెంటర్లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని వెల్లడించారు. ప్రస్తుతం మంత్రి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ..ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు.
మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతి సందర్భంగా అమలాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి విశ్వరూప్ పాల్గొన్నారు. అనంతరం ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో కిందపడిపోయారు. దీంతో ఆయనను అమలాపురంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. బ్రెయిన్ స్టోక్స్కు గురైనట్లు గుర్తించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆస్పత్రి అక్కడి నుంచి నిన్న రాత్రి హైదరాబాద్ కు తరలించారు.