శ్రీశైలం : ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం కుటుంబ సమేతంగా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామి వారలను దర్శించుకున్నారు. సోమవారం మధ్యాహ్నం క్షేత్రానికి చేరుకున్న ఆయన మొదట సాక్షి గణపతి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం ప్రధాన దేవాలయంలో మహా మంగళ హారతి, సహస్ర దీపార్చన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉభయ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రికి వేదపండితులు ఆశీర్వచనం చేయగా.. అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అంతకు ముందు ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు.