AP News | మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డికి ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను కాంగ్రెస్లో ఉన్నప్పుడు సోనియా గాంధీ కాళ్లనే మొక్కలేదని.. అలాంటిది కిరణ్కుమార్ రెడ్డి కాళ్లు ఎలా పట్టుకుంటానని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. పదేండ్లు అజ్ఞాతంలో ఉండి.. ఇప్పుడు బయటకొచ్చి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడని సీరియస్ అయ్యారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికిఉన్నన్ని రోజులు ఆయనతో సన్నిహితంగా ఉండి.. వైఎస్సార్ మరణం తర్వాత ఆయన కుటుంబానికి కిరణ్కుమార్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు. వైఎస్ జగన్ను 16 నెలలు జైలులో పెట్టింది కిరణ్కుమార్రెడ్డి కాదా? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ను అరెస్టు చేస్తానని.. రాష్ట్ర విభజనకు సహకరిస్తానని చెప్పి చిదంబరం కాళ్లు పట్టుకుని.. కిరణ్కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని విమర్శించారు. పుట్టపర్తి సాయిబాబా చనిపోతే పది రోజుల పాటు ఆయన పార్థివ దేహాన్ని అక్కడే ఉంచి.. అందర్నీ బతికి ఉన్నట్లు నమ్మించి.. అక్కడ ఉన్న సంపద అంతా దోచుకుంది నిజం కాదా? అని నిలదీశారు.
కాంగ్రెస్ పార్టీని మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డి సర్వనాశనం చేశారని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్లో ముఖ్యమంత్రిగా పనిచేసి.. ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. సమైక్యాంధ్ర పార్టీ పెట్టి మెడలో చెప్పులు వేసుకుని తిరిగాడని.. ఇలాంటి ద్రోహికి ఎన్నికల్లో డిపాజిట్ లేకుండా చేయాలని పిలుపునిచ్చారు.