అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. నెల్లూరు జిల్లా మంత్రి ఇంటి నుంచి ప్రారంభైన అంతిమ యాత్ర జొన్నవాడ, బుచ్చిరెడ్డి పాలెం, సంగం, వాసిలి, నెల్లూరు పాలెం , డీసీపల్లి, మర్రిపాడు, బ్రాహ్మణపల్లి మీదుగా ఉదయగిరిలో మేకపాటి రాజమోహనరెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ వరకు చేరుకుంది. దారిపోడువునా అభిమానులు, నియోజకవర్గ కార్యకర్తలు నివాళులు అర్పించారు.
ప్రభుత్వ లాంఛనాలతో గౌతమ్రెడ్డి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. . ఏపీ సీఎం వైఎస్ జగన్ దంపతులు తాడేపల్లి నివాసం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఉదయగిరికి చేరుకుని మంత్రి మేకపాటి అంతియ దహన సంస్కారాల్లో పాల్గొని మంత్రి పార్ధివాదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళి అర్పించారు. . ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు కార్యక్రమంలో నివాళులు అర్పించారు. గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. గౌతం రెడ్డి కుమారుడు అర్జున్రెడ్డి తండ్రి చితికి నిప్పంటించారు.