(AP JAC) నెల్లూరు: తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రభుత్వంతో యుద్ధానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఎల్లుండి నుంచి దశలవారీగా ఆందోళన చేపట్టనున్నట్లు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ఏపీ జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీ నేతలు ప్రకటించారు. ఈ నెల 7 నుంచి 21వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జేఏసీ నేతలు పెంచల్ రెడ్డి, పెంచలరావులు ప్రకటించారు. జిల్లాలోని ఎన్జీవో హోంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
సీపీఎస్ రద్దు, పీఆర్సీ అమలు, కరువు భత్యం సహా పలు డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి ఇప్పటికే నోటీసులు ఇచ్చామని ఏపీ జేఏసీ ప్రతినిధులు వెల్లడించారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నందున ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోనిపక్షంలో తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? అయితే, ఒకసారి ఆలోచించండి..!
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
ఈ ‘ముక్కు’ రోగాలను పసిగడుతుంది.. ఎలాగంటే?
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..