ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం జనరల్, వొకేషనల్ ఫలితాలు ఒకేసారి విడుదలయ్యాయి. ఫలితాలను ఏపీ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ bie.ap.gov.in లో చూసుకోవచ్చు. ఆగస్టు 3 నుంచి 12వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి.
ఉత్తీర్ణత విషయానొకిస్తే.. ప్రథమ సంవత్సరంలో జనరల్ కోర్సుల్లో 35 శాతం, వొకేషనల్ కోర్సుల్లో 42 శాతం మంది, ద్వితీయ సంవత్సరంలో సాధారణ కోర్సుల్లో 33 శాతం, వృత్తి విద్యా కోర్సుల్లో 46 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అన్ని విభాగాలను పరిశీలిస్తే ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షల్లో మొత్తం 70.63 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.