అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్డు (Intermediate Board) శుక్రవారం ఇంటర్ ఫలితాలను (Results) వెల్లడించనుంది . రేపు ఉదయం 11.00 గంటలకు గుంటూరులోని బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాలను వెల్లడిస్తున్నామని వివరించారు. గత ఫిబ్రవరిలో నెలలో ప్రాక్టికల్స్, మార్చి లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలను నిర్వహించారు. ఫలితాలను bie.ap.gov.in , bie.apcfss.in వెబ్సైట్ (Website) ద్వారా పొందవచ్చని సూచించారు. ఈ పరీక్షలకు సుమారు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు వివరించారు.