ఫోరస్ కెమికల్ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదంలో గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఏపీ హోంమంత్రి తానేటి వనిత పరామర్శించారు. అయితే ఘటన జరగడానికి సరైన కారణం ఇంకా తెలియడం లేదని, మూడు గంటల్లో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. అయితే బాధితులు తీవ్రంగా గాయపడ్డారని, విపరీతమైన గాయాలయ్యాయని తెలిపారు.
సీఎం ఆదేశాల మేరకు బాధితులకు సరైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాలకు 25 లక్షల పరిహారం ప్రభుత్వం నుంచి అందిస్తామని, అలాగే ఫ్యాక్టరీ నుంచి కూడా 25 లక్షల పరిహారం అందిస్తామని ఆమె ప్రకటించారు. అయితే ప్రజలకు హాని కలిగించే పరిశ్రమలను మాత్రం తమ ప్రభుత్వం ప్రోత్సహించదని మంత్రి వనిత స్పష్టం చేశారు.