హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): ఏపీ టెట్, ఏపీ టీఆర్టీల షెడ్యూల్ను మార్చాలని ఆ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి సోమవారం ఆదేశాలు జారీచేసింది. రాత పరీక్ష తర్వాత ‘కీ’పై అభ్యంతరాల స్వీకరణకు సమయం ఇవ్వాలని ఆదేశించింది. టెట్, టీఆర్టీ మధ్య సముచిత సమయం ఉండేలా ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై గత బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ తీర్పును రిజర్వ్ చేశారు. టెట్, టీఆర్టీ మధ్య సముచిత సమయం ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం పెద్దిరాజు, మరో నలుగురు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుత ఈ నోటిఫికేషన్ రద్దుచేసి ఈ పరీక్షల నిర్వహణకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.