తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని ఇవాళ ఉదయం ప్రముఖులు దర్శనం చేసుకున్నారు. ఏపీ హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి రఘువీరారెడ్డి శ్రీవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. పూజల అనంతరం వేద ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.
మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ శ్రీవారి కరుణాకటాక్షలు వైసీపీ ప్రభుత్వంపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పలు పథకాలు అందజేస్తుందని తెలిపారు. ప్రతిపక్షాలు అనవసరంగా ప్రభుత్వంపై బురద చల్లుతుందని ఆరోపించారు.