అమరావతి : ఆంధ్రప్రదేశ్కు ఏడుగురు కొత్త జడ్జిల నియామకానికి సుప్రీంకోర్టు కొలిజియం సిఫారుసు చేసింది. హైకోర్టు జడ్జిలుగా అడుసుమిల్లి వెంకట రవీంద్రబాబు, వక్కల గడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, బండారు శ్యామ్సుందర్, ఊటుకూరు శ్రీనివాస్, బొప్పన వరాహలక్ష్మి నరసింహ, తల్లాప్రగడ మల్లిఖార్జునరావు, దుప్పల వెంకటరమణ పేర్లను సిఫారుసు చేసింది.
ఇవాళ సుప్రీం కోర్టు సీజే ఎన్ వీ రమణ నేతృత్వంలో జరిగిన కొలీజియంలో నిర్ణయం తీసుకున్నారు. ఏడుగురు న్యాయాధికారులకు జడ్జిలుగా పదోన్నతి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.