అమరావతి : సూపర్స్టార్ కృష్ణ మరణం పట్ల ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతాపం ప్రకటించారు. తెలుగు సినీ రంగానికి కృష్ణ అందించిన సేవలు మరవలేనివని అన్నారు. ఆయన మరణం అత్యంత విచారకరమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని కోరుతూ కృష్ణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు తదితరులు సంతాపం తెలిపారు. సూపర్స్టార్ మరణంతో ఒక అద్భుత సినీశకం ముగిసినట్లయిందని వారు పేర్కొన్నారు.