అమరావతి : సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా ఏపీ గవర్నర్ భిశ్వ భూషణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి ముఖ్యమైన పండుగ సంక్రాంతి అని, పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఏపీ గవర్నర్ అన్నారు. ప్రతి తెలుగు లోగిలిలో సంక్రాంతి కొత్త వెలుగులు నింపాలని చంద్రబాబు, నారా లోకేశ్ అన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు పండుగను జరుపుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా ప్రజలకు వారు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.