విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కరోనా నుంచి సంపూర్ణంగా కోలుకున్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.
గన్నవరం నుంచి నేరుగా విజయవాడ రాజ్భవన్కు వెళ్లారు. ఈ నెల 16న గవర్నర్కు కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించిన విషయం తెలిసిందే.