అమరావతి : తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాల తరహాలోనే ఉక్రెయిన్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కోరారు. ఈ మేరకు ఏపీ సీఎం జగన్కు ఆయన లేఖను రాశారు. ఉక్రెయిన్లో విద్యాభ్యాసం కోసం వెళ్లి రష్యా ఉక్రెయిన్పై యుద్ధం కారణంగా స్వస్థలాలలకు చేరుకున్న ఏపీ విద్యార్థులకు విద్యాభ్యాసం పూర్తికి ప్రభుత్వం కల్పించాలని కోరారు.
కొందరు విద్యార్థులకు ఇప్పటికే ఆన్లైన్ క్లాసులు ప్రారంభం కాగా వర్సిటీల నుంచి సమాచారం లేక కొందరు విద్యార్థులు అయోమయంలో ఉన్నారని చెప్పారు. చదువు ఖర్చు భరిస్తామని తెలంగాణ, తమిళనాడు ప్రకటించాయి. ఏపీలో సీఎం జగన్కూడా ప్రకటించాలని ఆయన కోరారు.
ఏపీకి చెందిన మొత్తం 770 మంది విద్యార్థులు ఉక్రెయిన్లో ఉండగా, 650 మంది విద్యార్థులు సురక్షితంగా ఇళ్లకు చేరుకున్నారు.