తిరుమల: ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వారికి వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటే ఈరెండున్నర ఏండ్లలో రాష్ట్రం అభివృద్ధి విషయంలో ఎక్కడికో పరుగులు తీసేదని పేర్కొన్నారు.
కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గట్టేక్కించేందుకు ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న చొరవతో సమస్యలు పరిష్కారమవుతున్నాయని అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు , కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న సమస్యలు, ఇచ్చిన హామీలు పరిష్కారం కావాలని శ్రీవారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.