వరంగల్: రైలు విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్తున్నది. రైలులో నుంచి ఒక్కసారిగా పొగలు. ఏదో ప్రమాదం జరిగిందని ప్రయాణికుల్లో ఆందోళన. పొగలను గమనింగిన లోకోపైలట్ రైలును ఆపాడు. దీంతో జనాలంతా బోగీల్లోంది దిగి పరుగులు పెట్టారు. ఇదంతా ఏపీ ఎక్స్ప్రెస్ (AP Express) రైలులో జరిగింది.
ఏపీ ఎక్స్ప్రెస్ రైలు.. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్తున్నది. ఈ క్రమంలో ఎస్ 6 బోగీలో ఒక్కసారిగా పొగలు రావడం ప్రారంభమయింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ వరంగల్ జిల్లాలోని నెక్కొండ స్టేషన్లో రైలును నిలిపివేశారు. దీంతో అప్పటికే భయాందోళనల్లో ఉన్న ప్రయాణికులు రైలులోనుంచి పరుగులు తీశారు. రైల్వేస్టేషన్లో ఉన్నవారు కూడా బయటకు పరుగులు పెట్టారు. కాగా, బ్రేకులు జాం కావడంతో పొగలు వచ్చాయని, ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. రైలును నెక్కొండ స్టేషన్లోనే నిలిపివేశారు. బ్రేకులకు మరమ్మత్తు చేసిన తర్వాత రైలు బయలుదేరుతుందని చెప్పారు.