Ex Minister Satyanarayana | మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ (99) తుది శ్వాస విడిచారు. అనారోగ్య కారణలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన మంగళవారం ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలోని నివాసంలో కన్నుమూశారు. మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలిసారిగా 1983 ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుపొందారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతల్లో ఆయన ఒకరు.
ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ సమయంలో ఆయనకు టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున నాలుగుసార్లు పోటీ చేసి విజయం సాధించారు. 1983, 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా పోటీ చేసి గెలుపొందారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కేబినెట్లో పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖల మంత్రిగా సేవలందించారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా, అసెంబ్లీలో అంచనాల కమిటీ చైర్మన్గా వివిధ హోదాల్లో పని చేశారు.