అమరావతి: ఏపీ ఈసెట్-2022 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి బుధవారం విడుదల చేశారు. జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో గత నెల 22న ఆన్లైన్లో నిర్వహించిన ఈ పరీక్షకు దాదాపు 3000 మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా, మొత్తం 92.36 శాతం ఉత్తీర్ణులవగా.. వీరిలో బాలురు 91.44 శాతం, బాలికలు 95.68 శాతం మంది ఉన్నారు.
14 విభాగాల్లో నిర్వహించాల్సిన పరీక్షలను 11 సెక్షన్లలోనే నిర్వహించినట్లు హేమచంద్రారెడ్డి తెలిపారు. కొన్ని కోర్సుల్లో ఉన్న సీట్ల కంటే దరఖాస్తులు తక్కువగా రావడంతో పరీక్ష నిర్వహించలేదన్నారు. ఫలితాలను విద్యార్థులు అధికారిక వెబ్సైట్ https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ECET_GetResult.aspx ను సందర్శించి తెలుసుకోవచ్చు.