AP EAPCET | ఏపీ ఎంట్రన్స్ టెస్టుల షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. వచ్చే ఎన్నికల దృష్ట్యా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీఈఏపీసెట్-2024 పరీక్షలు వాయిదా పడ్డాయి. మే 13న జరగాల్సిన పరీక్షలను 16వ తేదీకి వాయిదా వేశారు.
మే 13వ తేదీ నుంచి మే 19వ తేదీ వరకు నిర్వహించాలని ముందుగా నిర్ణయించారు. కానీ మే 13వ తేదీన ఎన్నికలు జరగనుండటంతో ఆ పరీక్షలను 16వ తేదీకి పోస్ట్పోన్ చేశారు. తాజా షెడ్యూల్ ప్రకారం మే 16, 17వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు జరగనున్నాయి. మే 18 నుంచి 22 వరకు ఇంజనీరింగ్ రాత పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే ఏపీ పీజీసెట్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. జూన్ 3వ తేదీకి బదులు 16వ తేదీకి పీజీసెట్ పరీక్షను వాయిదా వేశారు.