Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. తీవ్ర జ్వరంతో పాటు స్పాండిలైటిస్ సమస్యతో కూడా ఆయన ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
అనారోగ్య సమస్యల కారణంగా వైద్యుల సూచన మేరకు పవన్ కల్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్నారని ఏపీ డిప్యూటీ సీఎంవో వెల్లడించింది. ఈ నేపథ్యంలో గురువారం జరిగే మంత్రిమండలి సమావేశానికి పవన్ కల్యాణ్ హాజరు కాకపోవచ్చని తెలిపింది.
ఇవాళ ఉదయం ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదం తెలిపిన పరిశ్రమలకు భూ కేటాయింపులతో పాటు, రిజిస్ట్రిషన్ విలువల పెంపు సహా పలు కీలక అంశాలపైనా ఈ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. విశాఖలోని పంచగ్రామాల సమస్యపైనా ఇందులో చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అంశంపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది.