అమరావతి: సినీ పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోనే కాదు సినీ పరిశ్రమలోనూ వారసత్వ రాజ్యం నడుస్తున్నదని చెప్పారు. పరిశ్రమ మూడు కుటుంబాల చేతిలోనే ఉందని, చిత్ర సీమపై వారి ఆధిపత్యం కొనసాగుతున్నదని వెల్లడించారు. నిర్మాతలు నష్టపోయినప్పుడు హీరోలు ఆదుకోలేదని విమర్శించారు. హీరోల గురించి ఎక్కువ మాట్లాడితే తనను ఓడించేందుకు ప్రయత్నిస్తారేమోనని సందేహం వ్యక్తం చేశారు. టికెట్ ధరలపై కమిటీ నిర్ణయం ప్రకారమే తదుపరి చర్యలు ఆధాపరడి ఉంటాయన్నారు. పేదవాళ్లు కూడా సినిమా చూడాలనే ఉద్దేశంతో సీఎం జగన్ టికెట్ ధరలు తగ్గించారని వెల్లడించారు.