Srisailam | మార్చి ఒకటో తేదీ నుంచి 11వ తేదీ వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరు కావాలని దేవస్థానం అధికారులు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు.
సోమవారం ఏపీ డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను శ్రీశైలం దేవస్థానం ఈఓ డీ పెద్ది రాజు తదితరులు కలిసి.. శ్రీశైల మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేశారు. బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని కోరారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణకు వేదాశీర్వచనం అందించి శేష వస్త్రాలు, ప్రసాదం అందజేశారు.