CS Jawahar Reddy | ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇటీవల విశాఖ ప్రాంతంలో పర్యటించారు. ఆయన పర్యటన వివాదాస్పదంగా మారింది. అయితే, జవహర్రెడ్డి విశాఖలో భూ అక్రమాలకు పాల్పడుతున్నారని జనసేన నేత పీతలమూర్తి ఆరోపించారు. త్వరలోనే పదవీ విరమణ చేయనున్న సీఎస్.. విశాఖ, విజయనగరం జిల్లాల్లో రూ.2వేలకోట్ల విలువైన అసైన్డ్ భూములను చేజిక్కించుకున్నట్లు విమర్శించారు. జవహర్రెడ్డి సీఎస్గా వచ్చేకే భూముల మార్పిడి జీవో 596 వచ్చిందని.. ఆ జీవోతో ఆయన తనయుడు విశాఖ ప్రాంతంలో 800 ఎకరాలు కొట్టేశారన్నారు. మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాదనే భయంతో సీఎస్ హడావుడిగా రిజిస్ట్రేషన్ల కోసం విశాఖ వచ్చారని ఆయన ఆరోపించారు.
భోగాపురం ఎయిర్పోర్ట్పై సమీక్ష పేరు చెబుతున్నారని విమర్శించారు. అయితే, ఈ ఆరోపణలను జవహర్రెడ్డి కొట్టిపడేశారు. విశాఖ పరిసరాల్లో తాను, కుటుంబ సభ్యులు ఎవరూ అసైన్డ్ భూములను కొనుగోలు చేయలేదన్నారు. పీతల మూర్తి చేస్తున్న ఆరోపణలు నిరాధారమని.. తాను ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు విశాఖ వెళ్లానన్నారు. అదే సమయంలో భోగాపురం ఎయిర్పోర్ట్ని పరిశీలించానని.. అసైన్డ్ భూముల కోసమే విశాఖ వచ్చాననడం అర్థరహితమన్నారు. తన కొడుకు గత ఐదేళ్లలో విశాఖ, ఉత్తరాంధ్రలోని ఏ జిల్లాకు వెళ్లలేదని.. తప్పుడు ఆరోపణలు చేసిన మూర్తి మీడియా ముందు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు వెనక్కి తీసుకోకపోతే చట్టప్రకారం క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.