అమరావతి: ‘ట్విట్టర్ బర్డ్’ ఫ్రై చేసిన కాంగ్రెస్ నేత జీవీ శ్రీరాజ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీతోపాటు రాహుల్ గాంధీ ప్రతిష్టను దిగజార్చినందుకు ఆయనను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సస్పెండ్ చేసింది. ట్విట్టర్ ఇటీవల రాహుల్ గాంధీతోపాటు ఆ పార్టీ ఖాతాను నిలిపివేసింది. కాగా, ఆంధ్రప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ కుమారుడు జీవీ శ్రీరాజ్ దీనిపై వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ నెల 17న ‘ట్విట్టర్ బర్డ్’ ఫ్రై చేశారు. దానిని ప్యాక్ చేసి దేశంలోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయానికి పంపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అయితే ఈ చర్య వల్ల కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ప్రతిష్టను శ్రీరాజ్ దిగజార్చినట్లు పార్టీ భావించింది. ఈ నేపథ్యంలో ఆయనను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ శుక్రవారం వెల్లడించింది.
Andhra Pradesh Congress Committee suspends GV Sri Raj from party's primary membership for "becoming disrespectful to prestige of party & Rahul Gandhi & tarnishing image of Congress."
— ANI (@ANI) August 20, 2021
He was seen cooking a "Twitter dish" in protest against Twitter's action against Rahul Gandhi. https://t.co/USDdJoCt0L